న్యూఢిల్లీ : వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదు సూత్రాల ప్రణాళిక (5టీ ప్లాన్)ను ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి 5టీ ప్లాన్ గురించి వివరించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, టీమ్ వర్క్, ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ అనేదే 5 టీ (5T) ప్లాన్ను సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా 12 వేల హోటల్ గదులను అద్దెకు తీసుకుని క్యారంటైన్ కేంద్రాలుగా మార్చబోతున్నామని చెప్పారు. 8 వేల మందికి సరిపోయేలా అత్యవసర చికిత్స అందించే ఏర్పాటు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
కరోనా కట్టడికి కేజ్రీవాల్ 5 టీ ప్లాన్